ARTICLE AD BOX
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Tuesday, April 9, 2019, 16:19 [IST]
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరాయి. డీలిమిటేషన్ తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం గెలుపొందింది. 2004 లో గెలిచిన గురుమూ ర్తి రెడ్డి 2009 ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఇక్క డి నుండి ఉప ఎన్నికల్లో గెలవగా.. 2004 లో విశాఖ-1 నుండి గెలిచి..పూర్తికాలం లేకుండానే మరణించారు. ఆయన తరువా త కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ఉప ఎన్నికలోనూ, 2009 లోనూ గెలుపొందారు. 1978 లో గెలిచిన అప్పన్న, 1989 లో గె లిచిన గురునాధరావులు తండ్రి-కొడుకులు. గురునాధరావు గతంలో నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాల్లో పని చేసారు. ఆయ న 1998 లో అనకాపల్లి నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక, 2009 ఎన్నికల తరువాత ఇక్కడ రాజకీయంగా పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
10 సార్లు ఎన్నికలు..
1967,1972 లో జామి నియోజవర్గంగా ఉండే ఈ ప్రాంతం 1978 లో పెందుర్తి నియోజవకవర్గంగా మారింది. ఇక్కడ మొత్తం పది సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో నాలుగు సార్లు టిడిపి, కాంగ్రెస్ నాలుగు సార్లు, సిపిఐ..ప్రజారాజ్యం ఒక్కోసారి గెలుపొందాయి. పరవాడ లో మూడు సార్లు గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసారు. గత రెండు సార్లు ఆయన ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 232878 ఓట్లు ఉండగా ,అందులో 181098 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన బండారు సత్యనారాయణ మూర్తికి 94581 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన గండి బాబ్జీకి 75888 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది బండారు సత్యనారాయణ మూర్తి 18648 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో గండి బాబ్జీ కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడారు.
English summary
Andhra Pradesh Assembly Election 2019: Know detailed information on Pendurthi Assembly Constituency of Andhra Pradesh. Get information about election equations, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Pendurthi Vidhan Sabha seat.
Story first published: Tuesday, April 9, 2019, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x